హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి- హరీష్ రావు

-

హుజూరాబాద్ బైపోల్ లో బీజేపీ ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా హరీష్ రావు బీజేపీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కొట్టుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ను ఓడించేందుకు హుజూరాబాద్ లో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. గెలిచినవాడు పొంగిపోడు.. ఓడిన వాడు కుంగిపోడని, ఒక్క ఓటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును గౌవరివిస్తామని హరీష్ రావు అన్నారు. ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరికీ హరీష్ రావు ధన్యవాదాలు తెలియజేశారు.

మరోవైపు ఈ విజయంతో ఎటువంటి పర్యవసనాలు ఉండవని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గెల్లు పోరాట స్పూర్తిని అభినందించారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు మరింత కష్టపడాలని సూచించారు కేటీఆర్

Read more RELATED
Recommended to you

Exit mobile version