మహిళల అభివృద్ధి కోసం అందరం కలిసి కృషిచేద్దాం : హరీశ్ రావు

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి రన్నింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అందరూ యోగ, రన్నింగ్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్‌ కోరిక అని చెప్పారు.

మహిళ‌ల అభ్యున్న‌తి కోసం అంద‌రం క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు కూడా అన్ని రంగాల్లో నంబర్​వన్​గా నిలవాలని ఆకాంక్షించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

5కే రన్ కోసం వచ్చిన వారందరిలో ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళల ర‌క్ష‌ణ‌కు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version