ఎండలకు మండిపోతున్న ఇంగ్లండ్‌ ప్రజలు.. ‘రెడ్‌ వార్నింగ్‌’ జారీ

-

ఇంగ్లండ్‌ దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడూ లేనంత ఈ ఏడాది అక్కడ వడగాలులతో ఎండలు ప్రజలను భయపడుతున్నాయి. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. దేశంలో తొలిసారి ఎండల కారణంగా ‘రెడ్‌ వార్నింగ్’ జారీ చేసింది ఇంగ్లండ్‌ ప్రభుత్వం. లండన్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించిందిబ్రిటన్ వాతావరణ విభాగం. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది.

ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ప్రమాదమని పేర్కొంటూ ‘అత్యయిక స్థితి’ని బ్రిటన్ వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రజలు ఎండలకు దూరంగా ఉండాలని, ప్రజలు ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది బ్రిటన్ వాతావరణ విభాగం. వీలైనంత వరకు బయటకు రాకుండా చూసుకోవాలని, అత్యవసర పనులను సైతం వీలైతే వాయిదా వేసుకోవాలని పేర్కొంది బ్రిటన్ వాతావరణ విభాగం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడ వచ్చన్న బ్రిటన్ వాతావరణ విభాగం.. మరోవైపు, బ్రిటన్ హెల్త్ ఏజెన్సీ కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది. తాజా పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని పేర్కొంది బ్రిటన్ వాతావరణ విభాగం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version