శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. హెలికాప్టర్‌లో రైడ్‌

-

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌ వచ్చింది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు తిరుపతి నగర వాసులకు ఒక మంచి అదృష్టం దక్కింది. తిరుపతి లో ఉన్న అందాలను ఆకాశం నుంచి వీక్షించే అద్భుత అవకాశం భక్తులకు దక్కింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు వచ్చిన జాయ్ రైడ్‌‌ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డితో కలసి హెలికాప్టర్ ఎక్కి చంద్రగిరి కోట వరకు వెళ్లి వచ్చారు.

ఈ నేపథ్యం లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ తిరుపతి పోలీస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే జాయ్ రైడ్ వల్ల తిరుపతి, చంద్రగిరి చుట్టు ప్రక్కల ప్రదేశాలను విహంగ వీక్షణం చేయొచ్చని, నాలుగు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తారని తెలిపారు. ఆరు సీట్ల కెపాసిటీ వున్న హెలికాప్టర్‌లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కేందుకు అవకాశముందన్నారు ఆయన . చంద్రగిరి కోట అందాలను ఆకాశం నుంచి తిలకించే అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version