రజనీ మూవీ నుంచి ప్రియాంక మోహన్ ఔట్.. కారణం ఆ గొడవలేనట!

-

‘గ్యాంగ్​లీడర్’​ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. అదేంటంటే.. దర్శకుడు నెల్సన్ దిలీప్​- ప్రియాంక మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ డాక్టర్ సినిమాలో ఆమె హీరోయిన్​గా నటించింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్​. ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అయినట్లు తెలుస్తున్నది. దీంతో సూపర్​ స్టార్​ రజనీకాంత్​ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందని ప్రచారం సాగుతోంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇటు ప్రియాంక గానీ, అటు దర్శకుడు నెల్సన్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

నెల్సన్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. ఇందులో రజనీ కాంత్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తోంది. అయితే తమన్నా కన్నా ముందే ఈ పాత్ర కోసం ప్రియాంకను అనుకున్నారట. కానీ నెల్సన్​తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్​కు నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని తెలిసింది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్​మీడియాలో ఇలా వార్తలు వస్తున్నాయి. ప్రియాంక మోహన్ ప్రస్తుతం రాజేష్, జయంరవి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్​గా చేస్తున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version