ట్రెండ్ మారింది గురు : అంతా యూట్యూబే.. మొన్న కీర్తి, నేడు రాశి ఖ‌న్నా

-

హీరోలు, హీరోయిన్లు సాధార‌ణంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ వంటి సోషల్ మీడియాలో త‌మ ఖాతాల‌లో ఎప్పుడు త‌మ మూడ్‌ను అభిమానుల‌తో పంచుకుంటారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్లు ట్రెండ్ మార్చారు. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ కు కూడా హీరోయిన్లు జై కోడుతున్నారు. వ‌రుస‌గా హీరోయిన్లు యూట్యూబ్ వైపు ప‌రుగెడుతున్నారు. సొంతంగా యూట్యూబ్ ఛాన‌ల్ ను క్రియేట్ చేసి త‌మ వీడియోల‌ను అందులో పోస్టు చేస్తున్నారు.

ఇప్ప‌టికే హీరోయిన్ కీర్తి సురేష్ యూట్యూబ్ ఛాన‌ల్ ను ప్రారంభించింది. అందులో త‌న వీడియోల‌తో త‌న అప్ డేట్స్ ను కూడా అందులోనే పోస్టు చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. తాజా గా హీరోయిన్ రాశి ఖ‌న్నా కూడా సొంతం గా యూట్యూబ్ ఛాన‌ల్ ను క్రియేట్ చేసిన‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. Raashii Khanna అనే పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపింది. అంతే కాకుండా త‌న యూట్యూబ్ ఛాన‌ల్ మొద‌టి వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ వీడియోలో త‌న ఇష్టాలతో పాటు త‌న గురించి వివ‌రించింది. ఈ ఛాన‌ల్ స‌పొర్ట్ చేయాల‌ని త‌న అభిమానుల‌ను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news