దిశ నిందితుల అంత్యక్రియలకు బ్రేక్ వేసిన హైకోర్టు..

-

దిశ ఘటనలో నిందితులను నిన్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేసు రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చింది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎల్లుండి రాత్రి వరకు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ వివరాలను అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version