లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత..సొంత పార్టీ నేతల తిరుగుబాటు

-

లోటస్ పాండ్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ టిపి కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తల ఆందోళన దిగారు. దీంతో లోటస్‌ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందంటూ కొందరు అసంతృప్తి నేతలు నిరసనకు దిగారు. వైఎస్ఆర్ టిపి పార్టీ కన్వీనర్, కో కన్వీనర్ పదవులను అమ్ముకున్నారని అసంతృప్తి నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

కమిటీ లను రద్దు చేసి.. కొత్త కమిటీ లను వేయాలని డిమాండ్ చేస్తున్నారు అసంతృప్తి నేతలు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. పార్టీ పదవులు ఏకంగా 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని ఆ పార్టీ నేత నర్సింహారెడ్డి నిన్న  సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా ఇవాళ లోటస్‌ పాండ్‌ దగ్గర ధర్నాకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version