అమరావతి లో హైటెన్షన్.. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి

-

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బాబు ఈ పర్యటనను ప్రారంభించగా.. బస్సులు, కార్లలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయన వెంట వెళుతున్నారు. అయితే, బాబు పర్యటనను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరించారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు అమరావతి పర్యటన హైటెన్ష‌న్‌గా మారింది. అయితే మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు.

 

రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని హెచ్చరించారు. కాగా, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. అటు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వెంకటపాలెం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version