హిమాయత్ సాగర్‌కు జళకళ.. గేట్లు ఎత్తివేత

-

న‌గ‌ర శివార్ల‌లో ఉన్న జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో హిమాయ‌త్ సాగ‌ర్ 2 గేట్ల‌ను 2 ఫీట్ల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఈ రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. హిమాయ‌త్ సాగ‌ర్ గేట్లు ఎత్త‌డంతో.. మూసీ ప్ర‌వాహం పెర‌గ‌నుంది. దీంతో మూసీ ప‌రివాహక‌, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. గేట్ల ఎత్తివేత కార్య‌క్ర‌మంలో జ‌లమండ‌లి ఎండీ దాన కిశోర్, రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

హిమాయత్ సాగర్ కు 1,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1,761.20 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 1,784.70 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పెరిగింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version