బీజేపీకి తిరుమల వేంకటేశునిపై ఉన్న భక్తి ఇది.. సూపర్ ప్రశ్న ఇది!!

-

ఏదైనా తెగేదాకా లాగితే వ్యవహారం చెడిపోతుంది అంటారు! మరీ శృతిమించిన వ్యవహారాలు అతిగా చేస్తే బూమరాంగ్ అవుతుందనే విషయం తాజాగా మరోమారు బీజేపీ విషయంలో వెలుగులోకి వచ్చింది. దీంతో… తిరుమల వేంకటేశునిపై బీజేపీకి ఉన్నది రాజకీయ భక్తి మాత్రమే తప్ప నిజంగా మనసుల్లో ఆ రేంజ్ భక్తి లేదని చెప్పే సంఘటన ఇది!

 

జగన్ ని టీటీడీ బోర్డు రిక్వస్ట్ చేస్తే.. ప్రజల తరుపున పట్టువస్త్రాలు సమర్పించాలని అడిగితే.. సాంప్రదాయ పద్దతిలో జగన్ ఆ కార్యక్రమం పూర్తిచేశారు. ఈ వ్యవహారంలో డిక్లరేషన్ పేరు చెప్పి బీజేపీ రాజకీయ డ్రామాలకు తెరలేపింది. ఫలితంగా పొలిటికల్ గా పబ్బం గడుపుకోవచ్చని భావించింది. దీంతో… నిజంగా బీజేపీ నేతలకు తిరుమల వేంకటేశునిపై అంత భక్తి భావాలున్నాయా అని ఒకసారి ఆలోచిస్తే… అస్సలు లేవని అర్థం అయ్యింది.. అందుకు కారణమైమంది “ప్రత్యేక హోదా”!

తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా బీజేపీ పెద్దలు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట “ప్రత్యేక హోదా”! మరి నిజంగా బీజేపీకి వెంకటేశ్వర స్వామిపై ఆనాయకులు మైకుల ముందు చెబుతున్నంత రేంజ్ లో నమ్మకం, భక్తి, గౌరవం ఉంటే… హోదా విషయం అలా ఎందుకు చేస్తారు.. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ.. నేడు ఆ మాటలు ఎందుకు మరిచింది.. స్వామిసాక్షిగా ఇచ్చిన మాటను ఎందుకు బూడిదలో పోసింది! ఇదేనా వారికి వెంకన్న మీద ఉన్న గౌరవం.. భక్తి పారవశ్యం!! సమాధానం ఆశిస్తున్న హిందువులకు బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు హిందువులు.. వెంకన్న భక్తులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version