నిజాం రాజు మంచివాడే..లేకుంటే ఉరితీశేవారు – తెలంగాణ హోం మంత్రి

-

నిజాం రాజు మంచివాడే..లేకుంటే ఉరితీశేవారు అంటూ తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజాం రాజు మంచి వాడని హోం మంత్రి మహమూద్ ఆలీ కితాబిచ్చారు. ఆయన తప్పు చేసి ఉంటే ఉరి తీసే వారిని అన్నారు.

నిజాంకు రాజ్ ప్రముక్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణను భారత్ లో విలీనం చేసేందుకు నెహ్రూకు లేక కూడా రాశారని తెలిపారు. కానీ కాశీం రజ్వి వ్యతిరేకించడంతో గందరగోళం నెలకొందన్నారు. ఇక విలీనం తర్వాత హిందువులతో పాటు నిజం కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.వర్నర్ తమిళిసై బీజేపీ పార్టీ నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అని గవర్నర్ అనడం కరెక్ట్ కాదని అన్నారు. సెప్టెంబర్ 17 తెలం గాణ జాతీయ సమైక్యత దినమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news