రాజమౌళి తో సినిమాపై ఓపెన్ కామెంట్స్ చేసిన మహేష్..!!

-

పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉండబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే అవుట్ ఫుట్ లో ఏమాత్రం వెనక్కు తగ్గరు అని చెప్పవచ్చు. ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ అనుకున్న ఔట్పుట్ వచ్చేదాకా ఆయన అసలు వదిలిపెట్టరు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటులలో తనకు కావలసిన విధంగా ఫైనల్ ప్రింట్ ను తీసుకోవడమే జక్కన్న స్పెషాలిటీ. అందుకే అలాంటి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఆ సినిమా పట్ల రాజమౌళి ఎంత జాగ్రత్త తీసుకుంటారు? అంటే సమాధానం అందరి దగ్గర ఉంటుంది. ఇక ఇదే విషయమే మహేష్ బాబు ఇచ్చిన రియాక్షన్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్న రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకు రానుందట. ఇక ఈ సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా కావాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కోసం అదిరిపోయే స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.. మహేష్ బాబు జక్కన్న క్రేజీ కాంబో కావడంతో సినీ ఇండస్ట్రీలో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతుండడంపై స్పందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

రాజమౌళి గారితో పనిచేయడం అనే కల నిజమవుతోందని చెప్పిన మహేష్ బాబు జక్కన్నతో ఓ సినిమా చేయడం అంటే తన 25 సినిమాలకు చేసిన పనితో సమానమని ఆయన తెలిపారు. రాజమౌళి సినిమా కోసం ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నానని ఈ సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version