భార్యను తాళ్లతో కట్టి కొట్టిన కేసులో భర్తతో పాటు 4 గురు అరెస్ట్

-

భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ అయ్యాడు. సహకరించిన అతని అక్క, మేనల్లుడు.. దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలు కూడా అరెస్ట్ అయ్యారు. రెండు చేతులను పాక గుంజలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నం చేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఘటన చోటు చేసుకుంది.

బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.ఈక్రమంలోనే కొంతకాలంగా భార్యాపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్న బాలాజీ.. స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది భాగ్యలక్ష్మి. అయితే శనివారం గ్రామానికి వచ్చి భార్యను డబ్బుల కోసం వేధించి.. ఆమె రెండు చేతులను తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు తీవ్రంగా హింసించాడు బాలాజీ. ఈ కేసులో బాలాజీతో పాటు కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news