హైదరాబాద్ : తల్లిని చంపిన యువతి కేసులో సంచలనాలు..!

-

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని చింతల్ మెట్ ప్రాంతంలో ఓ యువతి ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదమ్మ …యాదయ్య భార్యాభర్తలకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె వివాహం చేయగా రెండో కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఇక మూడో కుమార్తె నందిని ఇంటి వద్దే ఉంటోంది. కాగా నందిని కొంతకాలంగా రాజ్ కుమార్ అనే యువకుడు తో ప్రేమ లో ఉంది.

ఈ క్రమంలో నిన్న తల్లి పని కోసం బయటకు వెళ్లడంతో నందిని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే బయట పని దొరక్కపోవడంతో తల్లి ఇంటికి వచ్చి ఇద్దరినీ చూసి షాక్ అయ్యింది. దాంతో కూతురిని మందలించడంతో ఆమెతో పాటు ప్రియుడు రాజ్ కుమార్ యాదమ్మ పై దాడి చేసి చున్నీతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాము మైనర్ల మంటూ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరి ఆధార్ కార్డులు పరిశీలించిన తర్వాత ఇద్దరు మేజర్ లేనని పోలీసులు నిర్ధారించి కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news