హైదరాబాద్ నుండి విశాఖకు.. హై స్పీడ్ కారిడార్..!

-

హైదరాబాద్ నుండి విశాఖపట్నం కి హై స్పీడ్ రైలు రాబోతోంది ఆంధ్ర తెలంగాణ ప్రజల చిరకాల కల నెరవేరే సమయం దగ్గర పడింది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం దాకా విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హై స్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు కి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వే శాఖ పట్టు సర్వే చేపట్టింది.

దీనికి సంబంధించిన బాధ్యతల్ని గత సంవత్సరం మే నెలలోనే ఎస్ ఎం కన్సల్టెన్సీ కి అప్పగించింది వచ్చే నెల మార్చి నాటి కి ప్రాథమిక సర్వే పూర్తవుతుంది ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించబోతున్నారు. దీని వలన రంగారెడ్డి ఉమ్మడి నల్లగొండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంత వాసుల రైలు కల సాకారం అయ్యే అవకాశాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news