మోదీపై గౌరవం ఉంది కానీ ఊడిగం చేయను – పవన్ కళ్యాణ్

-

బిజెపి తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామని అంటే బిజెపి రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. తనకు ప్రధాని నరేంద్ర మోడీపై గౌరవం ఉంది కానీ ఊడిగం చేయనని అన్నారు. మరోవైపు వైసీపీ నేతలే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకోసారి తనని ఎవరైనా ప్యాకేజీ తీసుకున్నానని అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతానని చెప్పు తీసి మరీ చూపించారు. ఇళ్ల నుంచి బయటకి లాక్కొచ్చి మరీ కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ అనే సన్నాసుల్లారా మెడ పిసికి చంపేస్తానని.. ఇకపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని మండిపడ్డారు. “లండన్, న్యూయార్క్ లో పెరిగాను అనుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డుకారం తిని పెరిగా” అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తులకు జనసేన కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version