టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ..

-

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. కొత్త ఫార్మాట్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పోటీపడనుండగా వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. టోర్నీలో అతి చిన్న జట్లు కూడా ఉండడంతో బోరు కొట్టకుండా ఉండేందుకు షెడ్యూల్‌ రూపకల్పనలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 18న గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.

అలాగే చిన్న జట్లను ఎ, బి గ్రూపులుగా విభజించిన ఐసీసీ అందులో రెండు పెద్ద జట్లును వేసింది. గ్రూప్-ఎలో శ్రీలంక లాంటి పెద్ద జట్టుతోపాటు పపువా న్యూగినియా, ఐర్లండ్‌, ఒమన్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్ వంటి పెద్ద జట్టుతోపాటు నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌‌లను వేసింది. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత పొందుతాయి. ఇక, సూపర్-12లో ఉన్న జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు.

ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. కాగా, భారత జట్టు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 24న పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆడనుండగా, 29న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ‘ఎ2’తో ఆడనుంది. మూడో మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌తో మెల్‌బోర్న్‌లోనే తలపడనుంది. నవంబరు 5న ‘బి1’ విజేతతో నాలుగో మ్యాచ్, నవంబరు 8న ఆఫ్ఘనిస్థాన్‌తో సిడ్నీలో ఐదో మ్యాచ్‌ ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news