బీజేపీ గెలిస్తే.. రాజ‌కీయాల్లోంచి త‌ప్పుకుంటా : ఢిల్లీ సీఎం కేజ్రివాల్ స‌వాల్

-

బీజేపీకి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ స‌వాల్ విసిరారు. ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నికల‌ను స‌రైన స‌మ‌యంలో నిర్వహించి.. బీజేపీ గెలిస్తే.. త‌మ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ‌కీయాల‌కు పూర్తి దూరంగా ఉంటుంద‌ని స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్ ను స్వీక‌రించే ద‌మ్ము.. బీజేపీకి ఉందా అని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. ఢిల్లీ మున్సిప‌ల్స్ లో గెలిచే ద‌మ్ము బీజేపీకి లేద‌ని ఆయ‌న అన్నారు.

అందుకే ఢిల్లీలోని మూడు స్థానిక సంస్థ‌ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని విమ‌ర్శించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌మ పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌ని భ‌యం తోనే స్థానిక సంస్థ‌ల‌ను విలీనం చేస్తుంద‌ని ఆరోపించారు. ఓట‌మి భ‌యం లేకుంటే.. ఆ ఎన్నిక‌ల్లో ఫోటీ చేయాల‌ని బీజేపీకి స‌వాల్ విసిరారు. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీయే విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news