కండక్టర్‌ను తిడితే కటకటాలకే….. యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు..

-

ఇటీవల హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌ పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను ఆదివారం రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఎండీ సజ్జనర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

#TSRTC సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదు అని తేల్చి చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయి. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు.. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నాం అని రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version