టచ్ చేస్తే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన బిహార్ ఎమ్మెల్యే!

-

ఎవరైన దుష్టస్వభావం కలిగిన వారు మిమ్మల్ని టచ్ చేస్తే నరికేయాలని బిహార్ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ బాలికలకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా అమ్మాయిలకు కత్తులను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దసరా పండుగ రోజున బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ హింసను ప్రేరేపించేలా చేసిన ప్రసంగంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

బిహార్ రాష్ట్రంలోని సీతామర్హి నగరం కప్రోల్ రోడ్‌లోని దుర్గా పూజా పండల్‌ వద్ద నిర్వహించిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘ఏ దుర్మార్గుడు అయినా మన సోదరీమణులను తాకడానికి ధైర్యం చేస్తే, అతని చేతిని ఈ కత్తితో నరికివేస్తాం. మా సోదరీమణులకు వారి చేతులు నరికివేయగల సామర్థ్యం ఉండాలి. అవసరమైతే, నేను, మీరందరూ ఈ చర్య చేయాల్సి ఉంటుంది. మా సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version