సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ..కరోనా వ్యాప్తిపై కీలక ప్రకటన

-

ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు..ప్రధాని ప్రసంగంపై ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్ చేసింది..దేశంలో కరోనా సడలింపులు అన్‌లాన్ 5.0 మొదలైన తర్వాత మొదటిసారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు..దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటం..మరోసారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వ్యాప్తిపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది..

తాజా ఉద్దీపన ఫ్యాకేజీలపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి..పేద మధ్యతరగతి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు కూడా మోడీ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది..కరోనా వ్యాక్సిన్‌పై ముందుగా ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూడా క్లారీటి ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version