ఇండియా గ్లోబల్ ఫోరం… గురించి తెలియని వారు ఉండరు. ఇది సమకాలిన భారతదేశ కథను ప్రపంచానికి వివరిస్తుంది. అలాంటి ఇండియా గ్లోబల్ ఫోరం కీలక ప్రకటన చేయడం జరిగింది. సమకాలిన భారతదేశ పై భారతీయ కోణంలో వెలువడే ఉత్తమ రచనలకు పురస్కారాలను ప్రకటించింది. ప్రపంచ దేశాలతో ఇండియా సంబంధాలు, వాణిజ్యపరంగా అవకాశాలు పెంపొందించుకోవడం లాంటి అంశాల్లో గేట్ వేలా.. ఈ ఇండియా గ్లోబల్ ఫోరం వ్యవహరిస్తుంది. అయితే అలాంటి ఈ ఫోరం మరో కీలక అడుగు వేసింది. రచయితలకు పురస్కారాలు అందించేందుకు ముందుకు వచ్చింది ఇండియా గ్లోబల్ ఫోరం.

ఈ వారం ప్రముఖ రచయితలకు అవార్డులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఇండియా గ్లోబల్ ఫోరం ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి చెందిన రచయితలు జెఫ్రీ అర్చర్, అమిత్ త్రిపాటి , అభినందన లోధా హౌస్ స్పాన్సర్ తో igf లండన్ లో 2024 లో ప్రారంభించారు. అయితే ఈ వారం కూడా… IGF ఆర్చర్ అమిష్ అవార్డు విజేతను ఇండియా గ్లోబల్ ఫోరం ప్రకటించనుంది. ఇందులో భాగంగానే $25,000 ఉదారమైన బహుమతి అందించనున్నారు. UK ప్రభుత్వ సంస్కృతి, మీడియా , క్రీడల విదేశాంగ కార్యదర్శి Rt Hon లిసా నందీ MP, IGF చైర్మన్ మనోజ్ లాడ్వా , రచయితలు ఆర్చర్ , అమిష్లతో కలిసి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
వేదిక ఎక్కడ, ఎప్పుడంటే ?
ఈ అవార్డు ప్రదానోత్సవం.. జూన్ 18న లండన్లోని ప్రతిష్టాత్మక క్వీన్ ఎలిజబెత్ II సెంటర్లో IGF లండన్ 2025లో భాగంగా జరగనుంది.