ROJA ON THALLIKI VANDHANAM SCHEME: తల్లికి వందనం డబ్బులపై మాజీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ బడుల్లో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. ఏడాది కాలంలో ఒక్క పాఠశాల భవనం నిర్మించలేదని ఆగ్రహించారు.

నాడు నేడు పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయన్నారు. మరి దేనికి రూ.2 వేలు కట్ చేసుకొని రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు? అని నిలదీశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఈ రూ.2 వేలు ఎవరి ఖాతాలో వేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.