మహిళల్లో పెరుగుతున్న ఐరన్‌ లోపం.. శాపం కాకముందే వీటిని తినేయండి..!!

-

ఆరోగ్యం విషయంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కానీ అందంపైన ఉన్న కేరింగ్‌ ఆడవాళ్లకు ఆరోగ్యం మీద ఉండదు.. అమ్మ అయిన తర్వాత..బాధ్యతలు పెరిగిపోతాయి.. ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఎంత ఉన్నా.. పడేయడం ఎందుకని తినేస్తారు. కూరలు కూడా అంతే..! ఉద్యోగం చేయడం కంటే.. ఇంటిని చూసుకోవడమే చాలా కష్టమైన పని.. ఒక ఏజ్‌ వచ్చాకా.. మహిళలకు చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. ఐరన్‌ లోపం వస్తుంది. బుతుస్రావం అయ్యే మహిళలకు అయితే రక్తహీనత సమస్య కూడా వేధిస్తుంది.
ఐరన్ సాధారణంగా శరీరానికి అవసరమైన రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి, ఋతు రక్తస్రావం కోసం భర్తీ చేయడానికి సహాయపడుతుంది. శరీరంలోని ఇనుములో 70 శాతం వరకు హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎర్ర రక్త కణాలలో మయోగ్లోబిన్ అని పిలువబడే కండరాల కణాలలో ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తంలోని ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. ఐరన్‌ లోపిస్తే.. బాడీకి బ్లడ్‌ సరిపడా ఉండదు. రక్తహీనత బారిన పడతారు.

ఐరన్ లోపాన్ని సరిచేయాలంటే ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి..అవేంటంటే..

మొరింగ ఆకుకూరలు- మొరింగ ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ ఎ, సి, మెగ్నీషియం, ప్రొటీన్, బీటా కెరోటిన్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆహారంలో కనీసం వారానికి రెండు సార్లు మునగ ఆకుకూరలను చేర్చుకోండి. అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1 టీస్పూన్ మొరింగ ఆకుల పొడిని తీసుకుంటే శరీరంలో రక్తం పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్‌ ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి చిట్కా..
ఖర్జూరం, అత్తిపండ్లు, ద్రాక్ష- శరీరానికి శక్తిని అందించే ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఏ, సీ వంటి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. మీరు దీన్ని అలాగే తినవచ్చు లేదా రాత్రంతా నానబెట్టిన ఖర్జూరం, 2 అత్తి పండ్లను ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షతో కలపి అయినా తినొచ్చు..
బీట్‌రూట్, క్యారెట్- బీట్‌రూట్ ,క్యారెట్‌లో విటమిన్ సి సహా వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. బీట్‌రూట్‌, క్యారెట్‌లను మిక్సీలోగానీ, బ్లెండర్‌లోగానీ గ్రైండ్ చేసి జ్యూస్‌గా తీసుకుని టీస్పూన్ నిమ్మరసంలో కలిపి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు.
గోధుమ గడ్డి- ఇక ఇది అయితే బెస్ట్‌ డ్రింక్‌ ఫర్‌ బ్లడ్‌ అనే చెప్పాలి. ఒక గ్లాస్‌ గోధుమ గడ్డి జ్యూస్‌ తాగారంటే.. ఒక గ్లాస్‌ రక్తం తాగినట్లే.. అంత మంచిది..
శరీరంలో రోగనిరోధక శక్తిని రక్త స్థాయిలను మెరుగుపరిచే ఆహారాలలో గోధుమ గడ్డి ఒకటి. ఇందులో విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఈ గోధుమ గడ్డిని మెత్తగా రుబ్బుకుని జ్యూస్‌గా తింటే శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. గోధుమ గడ్డిని పెంచుకోవడం చాలా తేలికైన పనే..ఎలా పెంచాలో యూట్యూబ్‌లో చూడండి మీకే ఐడియా వస్తుంది.
నువ్వులు- ఇనుము లోపాన్ని సరిచేయడంలో నువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం ,విటమిన్ బి6, ఫోలేట్, ఇ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను మెత్తగా పేస్ట్‌ చేసి.. తర్వాత ఒక టేబుల్‌స్పూన్ తేనె, నెయ్యితో మిక్స్ చేసి లడ్డూగా చేసుకుని తినండి.. లేదా ఒకేసారి నెలకు సరిపడా లడ్డూలను కూడా చేసుకోండి. నువ్వులు, ఖర్జూరం చాలు.. తేనె, నెయ్యి కూడా వేయక్కర్లేదు. నువ్వులు వేడి చేసి.ఖర్జూరం గింజలు తీసేసి.. పేస్ట్‌ చేసి ఆ పేస్ట్‌కి నువ్వులు కలిపి లడ్డూల్లా చేసుకుని తింటే సరి! రోజు భోజనం తర్వాత ఒకటి తీసుకుంటేచాలు.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కేవలం ఐరన్‌ లోపం ఉన్నవాళ్లే తినాలని కాదు..! 30 దాటిన మహిళలు అంతా.. వీటిలో ఏదో ఒకటి తరుచుగా తీసుకుంటే.. చాలా అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version