ఇండియాలో మళ్ళీ 80 వేల కొత్త కేసులు

-

భారత్ లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. అయితే కరోనా కేసులు నమోదవుతున్న దాని కంటే రికవరీ అవుతున్న కేసులు ఎక్కువ ఉండడం ఒక్కటే ఏకైక ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,94,321 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 78,524 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది. గడచిన 24 గంటలలో 971 మంది వైరస్ కారణంగా చనిపోయారని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

Coronavirus on scientific background

దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,656గా ఉందని ప్రకటించింది. ఇక అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,02,425 ఉన్నాయి. కరోనా వైరస్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారు 58,27,705 మంది ఉన్నట్టు బులిటెన్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చనిపోయిన వారు 1,05,526 మంది ఉండగా దేశంలో బాధితుల రికవరీ రేటు 86.02 గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 13.4 గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,34,65,975 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news