ఇండియాలో మళ్ళీ పెరిగిన కేసులు..

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న కేసులు, మరణాలు బాగా తగ్గాయి. అయితే నిన్నటి కంటే ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 474మంది మృతి చెందారు. అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,739గా ఉంది.

 

corona

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,12,907 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు  4,46,805గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  83,35,109కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,30,993కి చేరింది. నిన్న ఒక్కరోజే 9,37,279 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 12,74,80,186 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువ కావడం ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version