గుడ్ న్యూస్ : ఇండియాలో భారీగా తగ్గిన కేసులు

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న కూడా నలభై వేల దాకా కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కేసులు, మరణాలు బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 30,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 435 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,851గా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,45,127 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,65,478గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,49,579 కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,30,070కి చేరింది. నిన్న ఒక్కరోజే 8,61,706 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 12,56,98,525 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువ కావడం ఊరట నిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news