ఇండియాలో థర్డ్ వేవ్ తగ్గుముఖం.. కొత్తగా 2.09 లక్షల కరోనా కేసులు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పడు రోజుకు రెండు లక్షల కరోనా కేసులు నమోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,09,918 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,13,02,440 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 18,31,268 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 959 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,95,050 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,62,628 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,89,76,122 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,66,03,96,227 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక రోజు వారి కరోనా పాజివీటి శాతం 15.77% గా నమోదు అయింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 4.43% గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version