ఇండియాలో కొత్తగా 14,313 కరోనా కేసులు : 224 రోజుల తర్వాత ఇదే తొలిసారి !

-

ఇండియాలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి కేసులు తగ్గిపోయాయి. మొన్నటివరకు 20 వేలకుపైగా నమోదవుతున్న కరోనా కేసులు… తాజాగా 14000 పడిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 14 , 313 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 224 రోజుల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,85,920 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,14, 900 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.04 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 181 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,50,963 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 , 579 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,33, 20 , 057 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 95. 89 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 11, 81, 766 మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా చేసిన కరోనా పరీక్షల సంఖ్య 58, 50, 38, 043 కి చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news