మిమ్మల్ని చూసి ఇండియా గర్విస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

-

యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం యూఏఈ పర్యటన సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘మిమ్మల్ని చూసి భారత దేశం గర్విస్తోంది. మీరు యూఏఈ నలుమూలల నుంచి, ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ ప్రతి ఒక్కరి హృదయాలు అనుసంధానమై ఉన్నాయి’ అని అన్నారు. అబూధాబిలో ఏర్పాటు చేసిన ‘అహాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళంలో మాట్లాడారు.

ఇదిలా ఉంటే ….అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయము బుధవారం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది.యూఏఈలో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. మరోవైపు అబుదాబిలో భారీగా వడగండ్లతో కూడిన వర్షాలు పడుతుండడం తో రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాల ఎఫెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ టూర్‌పై పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news