నేడే శ్రీలంక – ఇండియా మధ్య మొదటి టెస్ట్‌..అందరి చూపు కోహ్లీపైనే

-

ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న గ్రూపులో టీమిండియా ఉంది. ఈ తరుణంలోనే టెస్ట్ సిరీస్ కు కూడా సన్నద్ధమైంది ఇండియా. కై మొదటి టెస్ట్ మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతోంది. ఉదయం 9:30 గంటలకు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక టాస్ గెలిచిన జట్టు.. మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

జట్ల అంచనా :

ఇండియా : రోహిత్ శర్మ (సి), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (vc), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

శ్రీలంక : దిముత్ కరుణరత్నే (సి), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా (WK), లహిరు కుమార, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ

Read more RELATED
Recommended to you

Exit mobile version