Tokyo Paralympics : బ్యాడ్మింటన్ లో భారత్‌ చరిత్ర.. బంగారం పతకం సొంతం

-

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ లో భారత్‌ క్రీడా కారులు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 15 కు పైగా పతకాలు సాధించిన భారత క్రీడాకారులు… ఇవాళ కూడా దుమ్ములేపుతున్నారు. తాజాగా… టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ లో భారత్‌ ఖాతా లో మరో గోల్డ్‌ పతకం చేరింది. భారత అథ్లెట్‌ ప్రమోద్‌ భగత్‌ బంగారు పతకాన్ని సాధించాడు.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 లో ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ SL3 లో ఫైనల్‌ కు చేరిన ప్రమోద్ భగత్ అద్భుత విజయాన్ని సాధించాడు. దీంతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు ప్రమోద్ భగత్. అంతేకాదు.. భారత్‌ అథ్లెట్‌ మనోజ్ సర్కార్ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 లో కాంస్య పతకం సాధించాడు మనోజ్ సర్కార్.  ఈ రెండు పతకాల తో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 17 కు చేరినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news