50 ఏళ్ల తర్వాత అమెరికా మూన్ మిషన్.. ల్యాండింగ్ కష్టమే!

-

అగ్రరాజ్యం అమెరికా 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపైకి ల్యాండర్​ను పంపేందుకు ప్రయత్నించింది. అయితే ఆ దేశంలోని పిట్స్​బర్గ్​కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ చేపట్టిన ఈ ప్రయోగం సందిగ్ధంలో పడింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండర్​ను పంపగా లాంఛింగ్​ అయిన గంటలకే స్పేస్​క్రాఫ్ట్​లో ఇంధన లీకేజీ లోపం బయటపడింది. ఈ ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్​లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫల్సన్ సిస్టమ్​లో లోపం ఉంటే చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం కోల్పోతుందని అంటున్నారు.

ప్రయోగం జరిగిన 7 గంటల తర్వాత ల్యాండర్​ను సూర్యుడి దిశగా తిరిగేలా చేయగా.. ల్యాండర్​కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీన జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉండగా..  చాలా వరకు ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్​పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లక్ష్యాలను సవరించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమనే విషయంపై అంచనా వేసుకుంటున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version