పంతం నెగ్గించుకున్న జెలెన్​స్కీ.. ఒడెసా నుంచి ఆహార ఉత్పత్తులతో కదిలిన ఉక్రెయిన్ నౌక

-

ఎట్టకేలకు ఉక్రెయిన్ తన పంతాన్ని నెగ్గించుకుంది. రష్యా ఆక్రమించిన నౌకాశ్రయం నుంచి సరకుతో ఓ ఉక్రెయిన్ బయల్దేరింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలపై నిరంతరం దాడులు చేస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఒడెసా నౌకాశ్రయం నుంచి 30 వేల టన్నుల సరకుతో ఓ నౌక బయల్దేరింది. ఇందులో ఆహార ఉత్పత్తులూ ఉన్నాయి.

తమ సహకారం లేకుండా నల్లసముద్రం గుండా రవాణా సాగనీయబోమని రష్యా ఇటీవల హెచ్చరికలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఒడెసాను లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తూ వచ్చింది. అయితే ఆ హెచ్చరికలను తాము పట్టించుకోబోమని చెబుతూ వస్తోన్న ఉక్రెయిన్‌.. అంతర్జాతీయ సహకారం లభిస్తే.. తాము ఎగుమతులు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చివరకు తన పంతం నెగ్గించుకుంది. ఒడెసా నౌకాశ్రయం నుంచి నౌక బయల్దేరినట్లు అమెరికా కూడా ధ్రువీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news