గ్యాస్ స్టేషన్ లో పేలుడు.. 20 మంది మృతి..!

-

నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో ఆర్మోనియా సైనిక దళాలపై అజర్ బైజాన్ దళాలు దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఆ ప్రాంత పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్యాస్ స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

నాగోర్నో-కరాబాఖ్ వివాదస్పద ప్రాంతం విషయంలో అజర్ బైజాన్-ఆర్మేనియా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడి ఆర్మనియా సైనిక దళాలపై అజర్ బైజాన్ ఆర్మేనియాకు బయలుదేరారు. రహదారులపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ గ్యాస్ స్టేషన్ వద్ద ఇంధనం కోసం వాహనాలు క్యూ కట్టాయి. అదే సమయంలో అక్కడ భారీ పేలుడు సంభవించడంతో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే ఆరు, ఏడు వేల మంది తమ ప్రాంతంలోకి ఆర్మేనియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వందలాది మంది శాంతి పరీరక్షులతో స్థానికంగా సహాయ క్యాంపులు ఏర్పాటు దేశామని రష్యా వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news