జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై అటాక్.. రష్యా, ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు

-

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్కు చెందిన ఈ ప్లాంట్ ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది. ఈ కేంద్రంలో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్‌ చోటుచేసుకోలేదని తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్‌ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ ధ్రువీకరించారు. తమ దళాలు మంటలను సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించారు.

మరోవైపు ఈ పేలుళ్లపై రష్యా, ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని, వారు కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ఆరోపిస్తోంది. 2022లో ఈ అణుకేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకున్న రష్యా దళాలు రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేసి మొత్తం రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version