ఇజ్రాయెల్‌ పౌరులను చంపాలని ఆదేశాలు ఇవ్వలేదు: హమాస్‌

-

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్​పై హమాస్ అత్యంత క్రూరంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్​ను అంతం చేయాలని ప్రతిన పూనిన ఇజ్రాయెల్ గాజాపై దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో పిల్లలు సహా మహిళలు, వృద్ధులు, పౌరులు భారీ సంఖ్యలో ప్రాణాలొదులుతున్నారు.

అయితే ఇజ్రాయెల్​లో దాడులు జరిగిన ప్రాంతం విశాలంగా ఉండటంతో, కేవలం ఘర్షణలు మాత్రమే జరిగాయని తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హమాస్‌ ప్రతినిధి ఘాజా హమాద్‌ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మహిళలు, పిల్లలు, నిద్రపోతున్న వారిపై జరిపిన దాడులను ఏ విధంగా సమర్థించుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా….ఇజ్రాయెల్‌పై దాడిలో సామాన్య పౌరులను చంపాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అసలు అలాంటి ఆదేశాలను హమాస్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలా అయితే ఈ నెల 7వ తేదీన హమాస్‌ దాడిలో 1,400 మంది ఇజ్రాయెలీ పౌరులు ఎలా చనిపోయారని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా.. ‘‘ఇంటర్వ్యూ ఇక్కడితో ముగించాలనుకుంటున్నా’’ అని ఘాజా హమాద్‌ తప్పించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news