నౌక స్వాధీనం ఘటన.. ఇజ్రాయెల్తో ఉద్రిక్తల వేళ భారతీయ సిబ్బందికి ఇరాన్‌ ఊరట

-

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందులోని భారతీయ సిబ్బందికి టెహ్రాన్‌ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతిని ఇచ్చింది. గత శనివారం హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌ అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే.

ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆదివారం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడుతూ.. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఈ పరిణామాల వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ దీనిపై ఓ ప్రకటన జారీ చేస్తూ.. స్వాధీనం చేసుకున్న నౌక వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే అందులోని భారతీయ సిబ్బందిని న్యూదిల్లీ ప్రతినిధులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నౌక ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news