కాలింగ్ బెల్ కొట్టి ఆటపట్టించారని ముగ్గురు టీనేజర్ల హత్య

-

రాత్రి పూట తన ఇంటి కాలింగ్ బెల్ మోగించి ఆటపట్టించారని ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లను ఓ వ్యక్తి హత్య చేశాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ కేసులో భారత సంతతి వ్యక్తి దోషిగా తేలాడు. 2020 జనవరి 19న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రివర్‌సైడ్‌ కౌంటీ నివాసి అనురాగ్‌ చంద్రను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

కొందరు టీనేజర్లు తన ఇంటి డోర్‌బెల్‌ను మోగించి ఆటపట్టించారని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని.. తన కుటుంబ సభ్యుల భద్రత గురించి భయపడ్డానని చంద్ర విచారణలో తెలిపాడు. వారు తన వెనుక భాగంపై చరిచి కారులో పారిపోవడానికి యత్నించారని, వారిని నిలదీసేందుకు తన కారులో వారిలో అనుసరించానని.. ఈక్రమంలోనే అనుకోకుండా తన కారు వారి వాహనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నాడు. ఈ ఘటనలో వారి వాహనం చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో చంద్రకు పెరోల్‌ అవకాశం లేకుండా యావజ్జీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version