టిక్‌టాక్‌పై నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం

-

చైనాకు మరో షాక్ తగిలింది. డ్రాగన్​ దేశానికి చెందిన సోషల్ మీడియా నెట్​వర్క్ ప్లాట్​ఫామ్ టిక్​టాక్​ మరో దేశంలో నిషేధానికి గురైంది. భారత్ బాటలో పయనిస్తూ పొరుగు దేశం నేపాల్ టిక్​టాక్ యాప్​పై నిషేధం విధించింది. ఈ యాప్ వల్ల తమ దేశంలోని సామరస్యం దెబ్బ తింటోందని.. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు.

గత నాలుగేళ్లుగా 1600కు పైగా సైబర్‌ క్రైమ్‌ కేసులు ఈ యాప్‌పై నమోదైనట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్‌ సైబర్‌ బ్యూరో పోలీసులు, హోం శాఖతో టిక్‌టాక్‌ ప్రతినిధులు వారం క్రితం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. మరోవైపు ఎక్స్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్‌ల్లో ఏర్పాటు చేయాలని ఆ దేశ కేబినెట్​ మీటింగ్​లో నిర్ణయించినట్లు రేఖా శర్మ వెల్లడించారు.

టిక్​టాక్ నిషేధంపై ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార నేపాలీ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ గగన్‌ తాపా తప్పుబడుతూ… నిషేధానికి బదులు నియంత్రణ చేపట్టాల్సిందని అన్నారు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, యూకే దేశాల్లో బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేపాల్ కూడా చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news