హౌతీ స్థావరాలపై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా.. దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలంటూ వార్నింగ్

-

ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా, బ్రిటన్​కు చెందిన సైన్యం విరుచుకుపడింది. తమ నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ యెమెన్‌లోని వారి స్థావరాలే లక్ష్యంగా శనివారం రోజున మరోసారి దాడులకు తెగబడ్డాయి. ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్​ సెక్రటరీ లాయిడ్​ ఆస్టిన్​ ఏ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా, బహ్రెయిన్​, కెనడా, డెన్మార్క్​, నెదర్లాండ్స్​, న్యూజిలాండ్​ దేశాలు కూడా తమకు సహకరించాయని వెల్లడించారు.

అమెరికా, యూకేకు చెందిన మిలిటరీ బలగాలు కలిసి యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు జరిపాయని ఆస్తిన్ తెలిపారు. ఈ సంయుక్త చర్య హౌతీలకు స్పష్టమైన హెచ్చరికలు పంపించిందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్​పై వీరు చేస్తున్న అక్రమ దాడులను ఆపకపోతే, మున్ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో చట్టబద్ధంగా సరకు రవాణా చేస్తున్న అమెరికా సహా అంతర్జాతీయ నౌకలపై ఇరాన్​ మద్దతిస్తున్న హౌతీల దాడులను తాము చేపట్టిన ఈ సంయుక్త దాడులు ఆపుతాయని ఆస్టిన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news