నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి ?

-

నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి బరిలో ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. లోక్‌ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టికెట్ల కోసం…అశా వాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే…నల్గొండ ఎంపీ సీటు హాట్‌ కేక్‌ లాగా మారింది. నల్గొండ ఎంపీ సీటు కాంగ్రెస్‌ పార్టీ చాలా సులభంగా గెలుస్తుందనే నేపథ్యంలో… ఆ స్థానం నుంచే పోటీ చేయాలని అందరూ అనుకుంటున్నారు.

Komatireddy Venkata Reddy’s daughter Srinidhi as Nalgonda MP candidate

ఈ తరునంలోనే నల్గొండ ఎంపీ సీటుపై కాంగ్రెస్ ముఖ్యనేతలు కన్ను పడింది. తాజాగా నల్గొండ ఎంపీ టికెట్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధికి ఇస్తారని ప్రచారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కోమటిరెడ్డి కుటుంబం నుండి పవన్ ధరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందంటున్న పటేల్ రమేష్ రెడ్డి…తాను బరిలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. మరి నల్గొండ టికెట్‌ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news