ఐపిఎల్ 2023: రస్సెల్ మెరుపులు… ప్లే ఆఫ్ రేస్ లో కోల్కతా !

-

ఐపిఎల్ లో ఈ రోజు జరిగిన కోల్కతా మరియు పంజాబ్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ వీరుడు ఆండ్రే రస్సెల్ ఎట్టకేలకు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడంతో కోల్కతా ఉత్కంఠ గేమ్ లో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 180 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, కోలకతా చేదనలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆఖరి రెండు ఓవర్ లకు 26 పరుగులు అవసరం అయిన దశలో క్రీజులో ఉన్న రస్సెల్ ఆ ఓవర్ లో మూడు సిక్స్ లు కొట్టి మ్యాచ్ ను తనవైపుకు లాగేసుకున్నాడు. అయితే చివరి ఓవర్ లో 6 పరుగులు చేయాల్సి ఉండగా… నాలుగవ బంతికి రస్సెల్ రన్ ఔట్ అయ్యాడు.

చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో ఉన్న రింకు సింగ్ అర్ష దీప్ వేసిన చివరి ఫుల్ టాస్ బంతిని ఫైన్ లీగ్ దిశగా ఫోర్ గా మలిచి కోల్కతా కు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ విజయంతో కోలకతా 11 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి ఎగబాకింది. పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్ ను ఆర్ష్ దీప్ సింగ్ వేసిన లెగ్ సైడ్ బంతి కారణంగా ఓటమి పాలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version