IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.200పై చిలుకు రన్స్  చేయాల్సిన పిచ్‍పై స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు .అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తక్కువ స్కోర్ చేసింది.పంజాబ్‌ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో..నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

ఆ జట్టు ఒపినర్లు జైస్వాల్ 4, కాడ్మోర్ 18 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ 15 బంతుల్లో 18 పరుగులు,పావెల్ 4, జురెల్ డకౌట్ అయ్యారు. రియాన్ పరాగ్(48; 34 బంతుల్లో 6 ఫోర్లు), అశ్విన్(28 పరుగులు) మాత్రమే పర్వాలేదనిపించారు., పంజాబ్ బౌలర్లలో కరన్, చాహర్, హర్షల్ తలో 2, అర్ష్దీప్, ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. పంజాబ్ విజయానికి 145 రన్స్ అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news