IPL 2024 : రాణించిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ పై చెన్నై విజయం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్పై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ మాత్రమే చేయగలిగింది. ప్రభ్సమ్రన్ సింగ్ 30 పరుగులు, శశాంక్ సింగ్ 27 పరుగులు మినహా అందరూ విఫలమయ్యారు. జడేజా 3 వికెట్లు, సిమరీత్ సింగ్, తుషార్ చెరో రెండు వికెట్లు, శాంట్నర్, శార్దూల్ చెరో వికెట్ తీశారు.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 167/9 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టులో జడేజా(43) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ 32, మిచెల్ 30 పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న హిట్టర్లు ధోనీ, దూబే గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగారు. పంజాబీ కింగ్స్ బౌలర్లలో చాహర్, హర్షల్ చెరో 3, అర్ష్ దీప్ 2 వికెట్లతో చెలరేగారు.

Read more RELATED
Recommended to you

Latest news