IPL 2024 : ముగిసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

మొదట  బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా , ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి వికెట్ కు వీరిద్దరూ కలిసి పరుగులు చేశారు.పృథ్వీ షా 27 బంతుల్లో 43 పరుగులు చేయగా , వార్నర్ 35 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.మార్ష్ 18 పరుగులు చేయగా స్తబ్స్ డక్ అవుట్ అయ్యాడు. అక్షర పటేల్ 7 పరుగులతో, అభిషేకు పొరెల్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పతిరాన  3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ముస్తఫీజ్ రహమాన్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news