IPL 2024 : సన్రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు

-

ఐపీఎల్ 17 వ సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.

ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన సన్రైజర్స్ లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(16), ట్రావీస్ హెడ్ (19) విఫలం చెందారు. అబ్దుల్ సమద్ (29), అభిషేక్ (29), క్లాసెన్ (24) పర్వాలేదనిపించారు. మాక్రామ్ (17) మినహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు.గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు, ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ తలో వికెట్ తీశారు.

 

ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు రాణించడంతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో సుదర్శన్(45), మిల్లర్ (44*), గిల్ (36) రాణించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version