రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఐపీఎల్ 2024

-

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్‌ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. గత సంవత్సరంలో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఈ సంవత్సరము 53శాతం పెరిగింది. తాజా సీజన్‌లో 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను నమోదు చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్.

ఐపీఎల్‌ సీజన్‌ మొదటి రోజున జరిగిన మ్యాచ్‌ను 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది మొదటి రోజు వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే ఈ ఏడాది 51శాతం వృద్ధి చెందింది. వీక్షకులు సెషన్‌కు సగటున 75 నిమిషాలు వెచ్చించగా ,గతేడాదిలో ఈ సెషన్ సమయం 60 నిమిషాలుగా ఉంది. జియో సినిమా తన వీడియో క్వాలిటీని పెంచింది. 4కె వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్‌ ఆప్షన్స్‌, 12భాషల్లో ఫీడ్‌, AR/VR వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా వ్యూయర్‌షిప్‌ను పెంచడంలో కీలకపాత్రను పోషించాయి.

Read more RELATED
Recommended to you

Latest news