రేవంత్ తన సొంత మార్క్ కోసమే రాష్ట్ర చిహ్నం మారుస్తున్నారు : కాసం వెంకటేశ్వర్లు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత మార్క్ కోసమే రాష్ట్ర చిహ్నం మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర చిహ్నం ఇష్టానుసారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.రేవంత్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు.చార్మినార్ దురాక్రమణ దారులు కట్టిన కట్టడం.. కాకతీయ తోరణం స్వదేశీ రాజులు కట్టిన కట్టడం. రెండింటినీ కలిపి చూడటం భావ్యం కాదు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు కళాకారులతో చర్చించకుండానే రాష్ట్ర గీతం ను డిసైడ్ చేయడం సరైనది కాదు అన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళతో వియ్యం అందుకున్నారు. కోదండరాం.. రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారులు, కవులు, కళాకారులతో ఎందుకు చర్చించలేదు అన్నారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం పై ప్రజల మధ్య నిర్ణయం తీసుకోవాలి.కాంగ్రెస్ పార్టీ రాజకీయ దివాళా కోరుతనం కనిపిస్తుంది.రేవంత్ రెడ్డి కి ఏ విషయం పై అస్సలు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news